ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా కలెక్టర్ గా ప్రమోషన్పొందారు. ఆమెను కరీంనగర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చిత్రా మిశ్రా ఐటీడీఏకు మొదటి మహిళా పీవోగా 2024లో బాధ్యతలు చేపట్టారు. గిరిజనుల సంక్షేమానికి కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న ఆమెకు ఐటీడీఏ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏకు నూతన పీవోగా ఎవరినీ నియమించలేదు. కలెక్టర్ దివాకర టీఎస్కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
